Posts

Showing posts from June, 2025

హెచ్ ఎండిఏ కమిషనర్ ను మార్చండి

Image
హెచ్ఎండీఎలో తప్పని తిప్పలు. పైనుండి  ఆదేశాలు వస్తే తప్ప ముందుకు కదలని ఫైళ్లు. బాధితులకు తప్పని ఇబ్బందులు. సీఎంఓ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే పరిస్థితి లేక సామాన్యుల ఇక్కట్లు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పై సామాన్యులు గుర్రుగా ఉన్నారట.నెలల తరబడి తమ ఫైళ్లు పెండింగ్ లో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారని స్వర్ణ భారతీ జయంతి కాంప్లెక్స్ లో చర్చించుకున్నారని వినికిడి. ఎకరం , రెండెకరాల నుండి మొదలు పది ఎకరాల వరకు అనుమతులు రాకపోవడంతో సదరు బెనిఫిర్స్ ఆందోళనలో ఉన్నారు.లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి అనుమతుల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షనలు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు.ఫైళ్లు ఎందుకు ఆగుతున్నాయని అడగటంతో సదరు అధికారులు ఇచ్చే సమాధానంతో ఖంగు తింటున్నామని చెప్తున్నారు. పైనుండి ఆదేశాలు వస్తే ఫైళ్లు క్లియర్ చేసేది లేదని చెప్పడంతో ఎవరిని కాలవలో తెలియక అయోమయంలో ఉంటున్నారని అంటున్నారు.దీనివల్ల హెచ్ఎండీ ఎ కు చెడ్డ పేరు వస్తుందని ఫైర్ అవుతున్నారు.గతంలో అరవింద్ కుమార్ కమిషనర్ గా ఉన్న సమయంలో ఇదే పరిస్థితి ఎదురైంది.ఇప్పుడు అదే తంతు నడవడంతో  తమ గోడు ము...

గందరగోళంలో ఆర్థిక శాఖ...!

Image
 గందరగోళంలో ఆర్థిక శాఖ. మంత్రి తీరుతో అయోమయంలో ఫైనాన్స్ ఎంప్లాయిస్, జనం. ఆర్థిక శాఖలో కమిషన్ల పర్వం. సొంత అంశాలపైనే మంత్రి ద్రుష్టి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ గాడి తప్పింది.అన్ని డిపార్ట్మెంట్ లను సమానంగా చూడాల్సిన ఆర్థిక శాఖ మంత్రి అన్నింటి కంటే ఎక్కువ అయన సొంత పనుల మీద ద్రుష్టి పెట్టినట్లు తెలంగాణ సమాజం కోడై కూస్తుంది. ప్రభుత్వ , ప్రైవేట్ పరిధిలోని ఏ విభాగాల్లో పెండింగ్ బిల్లులు క్లియర్ కావాలంటే కమిషన్లు ఉండాల్సిందేనంట.చివరాఖరకు పార్టీతో ప్రభుత్వంతో అనుబంధంగా ఉన్న వారి దగ్గర నుండి కమిషన్లు ఆశిస్తున్నారట. ఫైనాన్స్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియాకు అవగాహనా ఉన్న ఆయన మౌనానికి పరిమితం అయ్యారు. మంత్రి అనుమతి లేకుండా కనీసం రెండు కోట్లు విడుదల చేయలేని పరిస్థితి లో ఉన్నారు.పంచాయితీ రాజ్ నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏడాదిన్నర కిందట  (పిఎంజెసి ) డెబ్భై ఐదు కోట్లు విడుదల చేసింది.రాష్ట్ర ప్రభుత్వం తన షేర్ కింద ఇవ్వాల్సిన యాబై ఐదు కోట్లు విడుదల చేయడానికి ఆర్థిక శాఖ మంత్రికి మనసు రావడం లేదట. నిత్యం కమిషన్ల కోసం తప్పితే ప్రజల కోసం పని చేయని వ్యక్తికీ ఆర్థిక శాఖ అప్పగించారని సచివాలయ వర్గా...

తెలంగాణ ట్రాన్స్ ఫోర్ట్ లో అవినీతి అక్రమాలు.

Image
  తెలంగాణ ట్రాన్స్ ఫోర్ట్ లో భారీగా అవినీతి తిమింగలాలు  ఉమ్మడి రంగారెడ్డి , హైదరాబాద్ లో భారీగా అవినీతి  నెలవారీ ఖాతాలో జేటీసీలకు కోట్లలో ఆదాయం  ప్రభుత్వ పారదర్శకత ఆయా విభాగాల్లో  జరుగుతున్న పనితీరుపై అదరపడుతుతుంది. ముఖ్యంగా సర్కార్ ప్రజలకు అనువైన అంశాలను చక్కదిద్దిపెడితే ప్రజలకు మంచి జరుగుతుంది.అంతేకాని అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇష్టారీతిగా వ్యవహరిస్తే లేనిపోని ఇబ్బందులు వచ్చిపడతాయి. ప్రస్తుతం తెలంగాణ ట్రాన్స్ ఫోర్ట్ డిపార్ట్మేమెంట్ లో అదే జరుగుతుంది అంటున్నారు. తాజాగా ఉప్పల్ రవాణా శాఖ కార్యాలయం లో ఏసిబి అధికారుల సోదాతో రాష్ట్ర వ్యాప్తంగా శాఖపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల్లో జాయింట్ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్లకు కాసుల పంట పండుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.శాఖలో పైనుండి ఉన్నతాధికారులకు పూర్తీ సహకారం ఉన్నందువల్లే తమకు ఫ్రీ హ్యాండ్ ఉన్నట్లు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఉన్న ఓ ఉన్నతాధికారి చెప్పడం శోచనీయం. మొదటి నుండి తనకు మంత్రితో మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఉన్నతాధికారుల సమన్వయం తో శాఖను చక్కబెట్టేవారు...

ప్రభుత్వ శాఖల్లో పబ్లిక్ రిలేటెడ్ వాటిపై ద్రుష్టి పెట్టండి.

Image
ప్రభుత్వ కీలక శాఖల్లో పబ్లిక్ రిలేటెడ్ వాటిపై ద్రుష్టి పెట్టండి. గతంలో సమస్య మీద లేఖ రాస్తే వెంటనే స్పందించే వారు.  అదే తరహాలో మాకు న్యాయం చేయండి అంటున్న సామాన్య జనం  ఒకవైపు  ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తుంటే ఇంకోవైపు కొందరు అధికారుల పనితీరు సర్కార్ ను ఇరకాటంలో పెట్టెలా చేస్తుంది. ప్రభుత్వం ఎంత పారదర్శకత ప్రదర్శించాలని చుసిన ఉన్నతాధికారుల అతి కారణంగా సామాన్యులు నష్టపోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం లో కీలకంగా పనిచేసే శాఖల పనితీరు అద్వాన్నంగా మారుతుందన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయి.అందులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ &అర్బన్ డెవలప్మెంట్ లాంటి శాఖలో ఉన్నతధికారుల తీరు చాల ఇబ్బంది కరంగా ఉందట.ప్రభుత్వ రంగ పరిధిలో పనిచేసే కొన్ని సంస్థలు అదే ప్రభుత్వంలో ఉండే కొన్ని శాఖలపై ద్రుష్టి పెడితే జనానికి మంచి జరిగే అవకాశం ఉందంటున్నారు మేధావులు. అవినీతి పరులు,లంచగొండిల ద్రుష్టి సారిస్తే రెగ్యులర్ గా క్లియర్ అయ్యే చాల ఫైల్స్ ఆగకుండా తమకు న్యాయం జరుగుతుంది అంటున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఎసిబి పనితీరు భేష్. చాలామంది సామాన్యులకు న్యాయం జరిగేలా చూసి అవినీతి అక్రమాలు చేసే వారి వెన్నులో ...

ఆ సెక్రెటరి తీరుతో ఎస్ఓలు, ఏఎస్ఓల ఇబ్బందులు.

Image
మారని ఎంఎయుడి సెక్రెటరీ తీరు  ఎన్నిసార్లు విన్నవించుకున్నా మారని వైఖరి  ఎస్ఓ , ఎస్ఓల ఇబ్బందులు  కిందిస్థాయి స్థాయి నుండి సెక్షన్ ఆఫీసర్ల మీద  పెరుగుతున్న ఒత్తిడి  తెలంగాణ మునిసిపల్ శాఖ పనితీరు అద్వాన్నంగా మారుతుందన్న  విమర్శలు రోజు రోజు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్య మంత్రి వద్దే శాఖ ఉందన్న బాధ్యత లేకుండా ఫైళ్లు నెలల తరబడి పెండింగ్ లో ఉంచడం పై సచివాలయ వర్గాల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.ఎస్ఓలు, ఎఎస్ఒల మీద ఒత్తిడి పెరుగుతుండటంతో ఆ అధికారి వద్ద పని చేయలేమంటూ అసంతృప్తిగా ఉన్నారట. రెగ్యులర్ ప్రాసెస్ కాగాల్సిన ఫైళ్లను సైతం చూడకుండా ఆపడంపై నేరుగా సీఎంను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటామంటున్నారు బాధితులు. జనరల్ అడ్మినిస్టేషన్ 250 ఫైళ్లు మిగతావి మరో రెండు వందల ఫైళ్లు మొత్తంగా ఐదు వందల ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయట.సాయంత్రం వేళా విజిటర్స్ సమయంలో వినతి పత్రాలు ఇచ్చి వెళదామని వస్తున్నా సందర్శకులకు దొరకకపోవడంతో తమ నియోజకవర్గల మంత్రులకు , ఎమ్మెల్యేలకు సమస్య చెప్పి కనీసం సీఎం తో నైనా చెప్పించి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నట్లు సమాచారం. దింతో అక్కడ పనిచేసే సిబ్బంది ఆ అధికారి మా...

సర్వీస్ లో ఆ ఐఏఎస్ టాప్

Image
సర్వీస్ లో ఆ ఐఏఎస్ టాప్  1995 లో ఐఏఎస్ గా పోస్టింగ్  దళిత ఆఫీసర్ కావడం తో దక్కని ప్రాధాన్యత. కాంగ్రెస్ లో కొంతకాలం ప్రాధాన్యత గల పోస్టింగ్ వచ్చిన పక్కన పెట్టిన సర్కార్ ఐఏఎస్ ( ఇండియన్ అడ్మినిస్టేటివ్ సర్విస్ ) అంటే మాములు విషయం కాదు. రాజకీయ నాయకులు కొద్దీ కాలమే ఉంటారు. కాలం కలిసి వస్తే కొంతమంది సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నత పదవులను అధిరోహిస్తారు.ఆఫీసర్లు కూడా అంతే.దాదాపు నలబై ఏళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ సర్వీస్ మొత్తం లో ఎంతవరకు ఉన్నత శాఖల్లో ఉన్నామన్నదే ప్రామాణికం అలాంటి కోవలోకె వస్తారు సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్.1995లో ఐఏఎస్ అయినా దాన కిశోర్ ఏలూరు జిల్లా నర్సాపూర్ సబ్ కలెక్టర్ గా మొదటి పోస్టింగ్ లో చేరారు.మొదటి పోస్టింగ్ లోనే అద్భుతమైన ఫలితాలు రాబట్టారు.తరువాత కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ పని చేసి 1997  మహబూబ్ నగర్ అచ్చంపేట లో ఎలక్షన్ డ్యూటీ ని సక్రమంగా నిర్వర్తించారు.2001 - 2002 లో కరీంనగర్ జాయింట్ కలెక్టర్ గా అభివృద్ధి అంటే ఏంటో చూపించి అప్పటి  కలెక్టర్ సుమిత్ర దవారా , ఆ జిల్లా ప్రజల ప్రశంశలు అందుకున్నారు.2005 - 06 లో కర్నూల్ కలెక్టర్ గా సూపర్ సక్సెస్...

ఎంఏయుడి పై ద్రుష్టి పెట్టండి

Image
 ఎంఎయుడి , హెచ్ఎండీఏ పై ద్రుష్టి పెట్టండి. ఏసీబీ ఉన్నతాధికారులను కోరనున్న బాధితులు. నెలల తరబడి తిరిగిన న్యాయం జరగడం లేదంటు ఆవేదన. ముసినిపల్ అడ్మినిస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ , హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లో వందల కొద్దీ ఫైళ్లు పెండింగ్. ప్రభుత్వానికి అత్యంత ఎక్కువగా ఆదాయం సమకూరే వివిధ శాఖల్లో నెలకొన్న ఇబ్బందులు, సమస్యలను సుమటోగా తీసుకోవాలని ఏసీబీ ఉన్నతాధికారులను కోరనున్నారు బాధితులు.ఏళ్ల తరబడి తిరిగిన తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత బిఆర్ఎస్ పాలనలో మున్సిపల్, హెచ్ఎండీఎ డిపార్ట్మెంట్ ల చాల అస్తవ్యస్తంగా మారింది. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా తమకు రూల్ ప్రకారం న్యాయం జరుగుతుందని ఆశించిన జరగడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెక్రెటరియేట్ మున్సిపల్ శాఖలో దాదాపు వెయ్యి పైగా ఫైళ్లు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.గతంలో దాన కిశోర్ మున్సిపల్ శాఖ ప్రినిసిపాల్ సెక్రెటరీగా ఉన్నప్పుడు సాధ్యమైనన్నీ ఫైళ్లు పెండింగ్ లో లేకుండా క్లియర్ చేసారు. కానీ కొత్త బాస్ గా ఇలంబర్తి బాధ్యతలు తీసుకున్న తరువాత  సీన్ మొత్తం రివర్స్ అయిందట.దింతో రెగ్యులర్ గ...

జీహెచ్ఎంసీ ఈఎన్సీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు

Image
అధికారులు వర్సెస్ రాజకీయ నాయకులు   రూలింగ్ పార్టిలో ఉన్న నేతలు చెప్పిన పట్టించుకొని అధికారులు  ఎవరైతే నాకంటి నాకు సీఎం సోదరుల సపోర్ట్ ఉందంటూ బెదిరింపు  లేటెస్ట్ గా  మహబూబా బాద్ ఎంపీ బలరాం నాయక్ చెప్పిన లైట్ తీసుకున్న జీహెచ్ ఎంసీ ఈఎన్సీ . కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నంత స్వేచ్చ మారె ఏ సర్కార్ లో ఉందంటారు. ఇదే అదునుగా కొంతమంది అధికారులు సొంత పార్టీ నేతల మాటలను లెక్క చేయడం లేదట.స్వారాష్ట్రంలో ఇక్కడి ఉద్యోగులను కాదని ఉన్నత పదవులను కట్టబెడితే అదే అదునుగా తమకు ముఖ్య మంత్రి సోదరుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని మిగతా నేతలకు ధమ్కీ ఇస్తున్నారని జోరుగా చర్చ నడుస్తోంది. వివరాల్లోకి వెళితే జీ హెచ్ఎంసీ ఈఎన్సీ గా బాధ్యతలు నిర్వరిస్తున్నా ఉన్నతాధికారి వ్యవహార శైలిపై జోరుగా ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కమిషనర్ మాట లెక్క చేయకపోవడం అటుంచితే అధికార పార్టీ నేతలు ఏదైనా సొంత పనికోసం వెళితే నేను చేయను ఎం చేసుకుంటారో చేసుకోండి అంటూ సుర్రు బుర్రు అంటున్నారట. రీసెంట్ గా ఎంపీ బలరాం నాయక్ అయన నియోజకవర్గానికి చెందిన ఓ ఉద్యోగికి అన్యాయం జరిగింది అవకాశం ఉంటె కొంచెం న్యాయం చేయండని అడిగారట. అందుకు ...

ఆర్ అండ్ బిలో ఓఎస్డీ అక్రమాలు..!

Image
  ఆర్ అండ్ బిలో ఓఎస్డీ  అక్రమాలు..!  మంత్రికి తెలియకుండా పదోన్నతుల విషయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు. డిఈఈ నుండి  ఈఈలుగా ప్రమోషన్లు పొందేవారి నుండి వసూల్  రిటైర్డ్ అయిన వ్యక్తికీ ఓఎస్డీ గా బాధ్యతలు  ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉండాల్సిన కొంతమంది వ్యక్తులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు.శాఖపరంగా మెరుగైన ఫలితాల సాధించాలంటే ఉద్యోగులదే కీలక పాత్ర.అలాంటిది అధికారాన్ని అడ్డుపెట్టుకొని మంత్రి మంచితనాన్ని ఆసరాగా చేసుకోని దాదాపు ముప్పై మంది ఎంప్లాయీస్ ను పదోన్నతులు రాకుండా అడ్డుకుంటున్నారట మంత్రి వద్ద ఓఎస్డీ గా పనిచేస్తున్న సదరు అధికారి.ఒక్కో ఈఈ నుండి ముప్పై లక్షల వరకు డిమాండ్ చేస్తుండటంతో  వారంతా ఎం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న కేబినెట్ మంత్రులందరిలో ఆర్ అండ్ బి శాఖ మంత్రికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తో మంచి సంబంధాలు ఉన్నాయి. తన శాఖకు అవసరమైన ఏ అంశాన్ని అయిన సూటిగా సీఎంకు చెప్పగలిగేంత చనువు ఉంటుంది.మిగతా మంత్రులతో పోలిస్తే ఆర్ అండ్ బిలోనే అత్యధికంగా రె...

సెక్రెటరియేట్ లో ఓ అసిస్టెంట్ సెక్రెటరీ దందా

ఫైళ్లు కదలకంటే ముడుపులు అందాల్సిందే   సెక్రెటరియేట్ లో ఓ అసిస్టెంట్ సెక్రెటరీ దందా  రోజు రోజు అద్వాన్నంగా మారుతున్న పంచాయితీ రాజ్ శాఖ తీరు  సంబంధిత శాఖ అమాత్యుల సమన్వయం లేకపోవడమే కారణం అంటున్న ఉద్యోగులు. ప్రమోషన్లు , పదోన్నతులకు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్న అధికారి తెలంగాణ ప్రభుత్వ అధికారుల్లో భిన్న ధ్రువాలు బయట పడుతున్నాయి. ముఖ్య మంత్రి మంచితనం కొంతమంది ఉద్యోగుల పాలిట కాసుల వర్షం కురిపిస్తుంది.అవకాశం వచ్చిందే తడువు ఇక తమకు ఎదురు లేదన్నట్లు రెచ్చిపోతున్నారు. ప్రమోషన్లు , పదోన్నతులకు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారుతున్నారు.అడిగినంత ఇవ్వకపోతే ఎక్కడ తమ ప్రమోషన్లకు, పదోన్నతులు ఆగిపోతాయోనన్న భయంలో ముడుపులు ఇచ్చుకుంటున్నారు. తాజాగా పంచాయితీ రాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రెటరి హోదాలో పని చేస్తున్న ఓ అధికారి తీరు అందరిని విస్మయానికి గురి చేస్తుంది. గతంలో హైయర్ ఎడ్యుకేషన్ లో ఇదే తంతు కొనాగిస్తే జీఏడీకి బదిలీ చేసారు.తరువాత పంచాయితీ శాఖకు పెద్ద రిఫరెన్స్ తో రావడంతో ఎంపిడివోలు , జిల్లా పరిషత్ సీఈఓలు , డిప్యూటీ సిఇఓలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా...

బదిలీపై వెళ్లిన ఇంకా శాఖ అధికారులపై పెత్తనం

Image
  శాఖలు మరీనా వివాదాస్పదంగా కొందరు ఐఏఎస్ ల తీరు   తాజాగా భారీగా ఐఏఎస్ లను బదిలీ చేసిన ప్రభుత్వం   రాష్ట్ర వ్యాప్తంగా పలువురు సీనియర్ ఐఏఎస్ లకు పదోన్నతులు  ఆర్ అండ్ బి సెక్రెటరీగా చేసి హైదరాబాద్ కలెక్టర్ గా వెళ్లిన హరిచందన వ్యవహార శైలిపై శాఖలో చర్చ  బదిలీపై వెళ్లిన ఇంకా శాఖలోని అధికారుల పై పెత్తనం ప్రభుత్వం పాలనా పరమైన నిర్ణయాల్లో ఎంత నిజాయితీగా ఉన్న కొంతమంది ఆఫీసర్ల తీరు మాత్రం మారడం లేదు. ఓ వైపు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఇంకోవైపు సంబంధిత శాఖల మంత్రులు పకడ్బందీ గా పని చేస్తున్న ఉన్నతాధికారులు మాత్రం విచ్చల విడిగా వ్యహరిస్తున్నారన్న ప్రచారం ఉంది. లేటెస్ట్ గా మొన్నటి వరకు రోడ్డు భవనాలు శాఖలో సెక్రెటరీ గా ఉన్న ఐఏఎస్ అధికారి హరి చందన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ ఈ ల ఫైళ్లు ఆపడం , రెగ్యులర్ ప్రమోషన్లు రాకుండా అడ్డుకోవడం లాంటి వాటివల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారట.న్యాక్ ఫైళ్లను ప్రస్తుతం డిపార్టుమెంట్ లో లేకున్నా హైదరాబాద్ కలెక్టరేట్ తీసుకెళ్లి సంతకాలు పెడుతున్నారట.డిపార్ట్మెంట్ లోని ఓ  ఈ ఈ ఇచ్చిన సమాచారంతో విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ప్రినిసి...

ఆ అధికారి మాకొద్దు బాబోయ్

Image
ఆ అధికారి మాకొద్దు బాబోయ్  ఉద్యోగుల ఆవేదన  అక్కడ పనిచేసినందుకు ససేమీరా  లివ్ లో వెళ్లేందుకు స్టాప్ ప్రయత్నం   తెలంగాణలో ఐఏఎస్ అధికారుల పనితీరుపై జరిగినంత చర్చ మరే ఇతర అంశాలపై జరగడం లేదు.ముఖ్యంగా వివిధ డిపార్ట్మెంట్లకు ఉన్నతాధికారులుగా ఏళ్ల తరబడి పని చేసిన వారి వ్యవహార శైలీపై కింది స్థాయి ఉద్యోగులు భయపడుతున్నారు.వారితో సరిగా ఉండకపోవడం, దురుసుగా ప్రవర్తించడం లాంటి వాటిపట్ల సంబంధిత శాఖల్లో పనిచేసేందుకు సుముఖుత చూపడం లేదట.సింగరేణిలో ఏడేళ్లు చక్రం తిప్పిన ఓ ఉన్నతాధికారి రీసెంట్ గా పంచాయితీ రాజ్ కు బదిలీ అయ్యారు.సింగరేణి కాలరీస్లో ఉన్నప్పుడు ఆయా నియోజకవర్గాల వారీగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఏదైనా వినతి పత్రం ఇవ్వడానికి వెళితే కనీసం అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదట. అదే అంశాన్ని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు శాసన సభ వేదికగా ప్రభుత్వం ముందు ఉంచారు.గతంలో సోషల్ వెల్ఫేర్ శాఖలో ఉన్నప్పుడు తోటి ఉద్యోగుల పట్ల కఠినంగా ఉండటం , అస్సలు శాఖను పట్టించుకోకపోవడంతో సీఎం నోటిస్కు తీసుకెళ్లారు పలువురు రూలింగ్ పార్టీ నేతలు.ఏడాది కాలం పాటు సోషల్ వెల్ఫేర్ ఉంటె అందులో ఓ అసిస్టెంట్ సెక్రెటరీ స్థా...

ఆ ఆఫీసర్ల తీరుపై వివాదం

Image
ఆ ఆఫీసర్ల తీరుపై వివాదం  సీఎం చెప్పిన మారని తీరు  శాఖల్లో ఇష్టారాజ్యంగా వ్యవహారం  ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటున్న సచివాలయ సిబ్బంది  ప్రభుత్వంలో అధికారుల తీరుపై సీఎం సీరియస్ గా ఉన్నారట.ఎన్నిసార్లు చెప్పిన తీరు మారకపోవడంతో  ఇక ఉపేక్షించేది లేదంటున్నారు సీఎం. పలువురు సీనియర్ అధికారులు వారి శాఖల్లో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని సమాచారం.ఎంఎయుడి ప్రిన్సిపాల్ సెక్రెటరి ఇలంబర్తి రెగ్యులర్ గా ఒక్క ఫైల్ చూడటం లేదని వినికిడి. మునిసిపల్ అడ్మినిస్టేషన్ స్టాప్ అంత అధికారి వైఖరితో బెంబేలెత్తుతున్నారనని జోరుగా ప్రచారం సాగుతోంది.ఎక్కడికి వెళ్లిన పది నెలల కంటే ఎక్కువగా ఉండటం లేదు. మాములుగా ఎవరైనా ఆఫీసర్ బదిలీపై వెళితే కనీసం మూడు నాలుగు ఏళ్ళు ఉంటారు కానీ ఈయన కేవలం నెలలకె పరిమితం అవుతున్నారు.ఛార్జి తీసుకున్నప్పటి నుండి దాదాపు ఎనభై ఫైళ్లు పెండింగ్ లో ఉన్నట్టు సమాచారం. విజిటర్స్ సమయంలో కూడా ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో బాధితులు వెనక్కు వెళ్తున్నారని తెలుస్తుంది.గతంలో దాన కిశోర్ , అరవింద్ కుమార్  ఉన్న సమయంలో అందరికి రెగ్యులర్ యాక్సెస్ ఉండేది.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ...