తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ పనితీరుపై అసంతృప్తి


 తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ పనితీరుపై అసంతృప్తి 

చిన్న ఉద్యోగులనే టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు 

వరుస దాడుల్లో నలభైకి పైగా ఫాల్స్ కేసులు తేలినట్లు సమాచారం 

శాఖ తీరుపై సీఎం ద్రుష్టి పెట్టాలంటున్న ప్రభుత్వ ఉద్యోగులు.

- ప్రభుత్వ పరిధిలో జితా భత్యాలు తీసుకొనే వారందరికి అవినీతి నిరోధక శాఖ అంటే భయం. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక ఏసీబీ అధికారులు కాస్త స్పీడ్ పెంచారనే చెప్పాలి. పంచాయితీరాజ్ , ఇరిగేషన్ , ఆర్ అండ్ బీ , విద్యుత్ శాఖ లాంటి వాటిపై ద్రుష్టి పెడుతున్న ఏసీబీ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ , పలువురు ఉన్నతాధికారులు ,( ఐఏఎస్ , ఐపీఎస్ ) లతో పాటు పలువురు రాజకీయ నాయకులపై కూడా ద్రుష్టి సారిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న చితక ఉద్యోగులనే టార్గెట్ చేయడం వల్ల ఎంప్లాయిస్ లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ఏసీబీ లో కొంతమంది అధికారుల అత్యుత్సహం సర్కార్ ను ఇరకాటంలో పెట్టెలా చేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగిన చర్యలు తీసుకుంటమని చెప్తున్నా అనిశా వందల ఫైళ్లు పెండింగ్ లో పెట్టె కొంతమంది ఐఏఎస్ ల మీద ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ లో ఉద్యోగులకు కాస్త ఫ్రిడమ్ దొరికిందన్న అభిప్రాయం ఉన్న అసలైన అవినీతి పరులను పక్కన పెట్టి తమలాంటి చిన్న స్థాయి ఉద్యోగులను టార్గెట్ చేయడం సరికాదు అంటున్నారు. ఈ మధ్య కాలంలో సిటీ వన్ ఏసిబి అధికారుల తీరు మరి విస్మయానికి గురి చేస్తుందట. ఇటీవల కాలంలో పంచాయితీ రాజ్ ఈఎన్సిని పట్టుకున్న ఎసిబి అధికారులు పెద్దగా ప్రాపర్టీస్ ను చూపలేకపోయారు. అదే తరహాలో విద్యుత్ శాఖలో మరో అవినీతి తిమింగళాన్ని పట్టుకుని భారీ మొత్తంలో డబ్బును సీజ్ చేసారు.ప్రభుత్వానికి ప్రధాన ఆదయ వనరుగా ఉన్న మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ పై ఏసిబి ద్రుష్టి సారిస్తే బాగుంటుంది అంటున్నారు సామాన్యులు. ఒక్క మునిసిపల్ శాఖలోనే ఏడు వందల ఫైళ్లు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం.మొత్తానికి ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన ఏసిబి మీద సీఎం పూర్తీ స్థాయిలో ద్రుష్టి సారిస్తే బాగుటుంది అంటున్నారు మేధావులు.

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ

జీహెచ్ఎంసీ ఈఎన్సీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు