తెలంగాణ సెక్రెటరియేట్ లో వింత పోకడ.

తెలంగాణ సెక్రెటరియేట్ లో వింత పోకడ. విజిటర్స్ కు అనుమతి లేదని హుకుం. జిల్లాలు,నియోజవర్గాలవారీగా నిత్యం సచివాలయానికి జనం తాకిడి. మంత్రులు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,ఎమ్మెల్సీలవెంట అనుచరులకు అనుమతి నిరాకరణ. మంత్రుల సిఫార్స్ ను పట్టించుకోని సీఎస్ఓ కార్యాలయ సిబ్బంది. జీఏడీ నుండి మాకు ఆదేశాలు అంటు అవుతున్న వైనం. తెలంగాణ లో ప్రజా పాలనా సాగుతుంది. ముఖ్య మంత్రి నిర్ణయాలతో పాలనా పరమైన నిర్ణయాల్లో వేగం పుంజుకుంది. ఆరు గ్యారెంటీలను సక్సెస్ ఫుల్ అమలు చేస్తూ లోకల్ బడి ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న వేళ ప్రభుత్వ పరిధిలో పనిచేసే కొన్ని కీలక విభాగాల అత్యుత్సహం వల్ల సర్కార్ కు చెడ్డ పేరు వస్తుందన్న అపవాదు ఎదురు అవుతుంది. సచివాలయం ప్రభుత్వ పరిపాలన విభాగానికి గుండె కాయ లాంటిది.అలాంటి సెక్రెటరియేట్ లో ఇప్పుడు ఆంక్షల పర్వం నడుస్తోంది. మద్రాస్ నుండి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన డెబ్భై ఏళ్ళల్లో ఎప్పుడు లేని విదంగా కొత్తగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విడిపోయాక బాధలు చెప్పుకోవడానికి సెక్రెటరియేట్ వచ్చే వాళ్లకు అనుమతి లేదంటూ ఆపుతున్నారు కొంత మంది సిబ్బంది.ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి మొదలు ఆదిలాబాద్ వరకు నిత్యం వేలాది మంది సందర్శకులు సచివాలయానికి వస్తుండేవారు. ఒకప్పుడు సచివాలయం చుట్టూ పక్కల ఉన్నా హోటలన్నీ విజిటర్స్ తో కిటకిటలాడేవి.గత టీఆరెస్ ప్రభుత్వ పుణ్యమా అని సచివాలయా ఎంట్రీకి సందర్శకులకు బ్రేకులు పడ్డాయి. బూర్గుల రామకృష్ణ రావు భవన్ లో తాత్కాలిక సెక్రెటరియేట్ ఉన్నప్పుడు మొదలైన ఆంక్షల పర్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు కొనసాగింది.రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యాక దానికి బ్రేక్ లువేస్తూ అందరికి సచివాలయానికి యాక్సెస్ ఇచ్చారు.అయితే కొందరు దీన్ని విచ్చల విడి తనానికి వాడటంతో పాసుల విధానాన్ని తీసుకొచ్చారు.సీఎం నిర్ణయం ఇప్పటి వరకు బాగానే ఉన్న దీన్ని ఆసరాగా తీసుకోని సచివాలయం వద్ద భద్రతా విభాగాన్ని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారుల తీరు అందరిని విస్మయానికి గురి చేస్తుంది.పాసుల ద్వారా సచివాలయం లోపలికి వచ్చిన వారిని ఆంక్షల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారట.పైనుండి మాకు ఆదేశాలు ఉన్నందున మీకు అనుమతి లేదంటూ బయటకు పంపిస్తున్నారట.లేటెస్ట్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అనుకోని ఉన్న ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే,అయన అనుచరులను ఆపేసి వాగ్వాదం చేసారని విశ్వాసనీయ వర్గాల సమాచారం.నేరుగా ముఖ్య మంత్రికి అత్యంత సన్నిహిత ఎమ్మెల్యేల్లల్లో ఒకరైన అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఇలా జరగడం పట్ల జోరుగా చర్చ నడుస్తోంది.ఇలా ఉన్నతాధికారుల తీరు వల్ల సర్కార్ బద్నామ్ అవుతుంది అంటున్నారు సామాన్య జనం.

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ

జీహెచ్ఎంసీ ఈఎన్సీ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు