మంత్రి సీతక్క శాఖ లో కమిషన్ల అధికారి
ఫైళ్లు కదలాలంటే ముడుపులు అందాల్సిందే
పంచాయితీ రాజ్ శాఖలో నిత్యం అదే పని
డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్రెటరిలో హోదాలో చక్రం తిప్పుతున్న వైనం
- తెలంగాణ సచివాలయంలో ఓ అధికారి తీరు అందరిని విస్మయానికి గురి చేస్తుందని తెలుస్తోంది.తాను పని చేస్తున్న శాఖలో అసిస్టెంట్ సెక్రెటరీలో హోదాలో విధులు వెలగబెడుతున్న సదరు అధికారి వ్యవహార శైలిపై జోరుగా చర్చ నడుస్తోందట. పంచాయితీ రాజ్ శాఖలో పిఆర్ టప్పాల్ కు వచ్చే ఫైళ్లను ముందుగానే ట్రాక్ చేసి బాధితుల నుండి డబ్భులు వసూలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.రాష్ట్ర వ్యాప్తంగా డిపార్టుమెంట్ పరిధిలో వివిధ సర్వీస్ మ్యాటర్ లలో నెలకొన్న ఇబ్బందులు ,ట్రాన్స్ఫార్లు, డిప్యూటేషన్లు , పదోన్నతులపై అసిస్టెంట్స్ సెక్రెటరిలో ఉన్న అధికారి దగ్గరకు వస్తుంటారు. పంచాయితీ రాజ్ శాఖ లో కీలక పోస్టులైన ఎండిఓ, డిపిఓ, జెడ్పి డిప్యూటీ సీఈఓ, సీఈఓ ల సర్వీస్ మ్యాటర్ లు అన్ని ఉంటాయి.వీరందరు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుండి ఉంటారు.అయితే పనుల నిమిత్తం వస్తున్నా వారిని వారి ఫైళ్లకు సంబందించిన సమాచారాన్ని ముందుగానే తెలియజేసి పై అధికారులతో సమన్వయము చేసి న్యాయం జరిగేలా చూస్తానని డబ్బులు వసులు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. టప్పాల్ లో తనకు అనుకూలమైన వ్యక్తి ద్వారా సాయంత్రం ఐదు తరువాత సెక్రెటరియేట్ లోనే అడ్డా పెడుతున్నట్లు డిపార్ట్మెంట్ వర్గాలు చెప్తున్నాయి.33 జెడ్పిలు , 550 ఎండిఓ లు, 33 మంది చొప్పున డిప్యూటి సీఈఓ లు , సీఈఓ లు మొత్తంగా ఏడు వందల మందికి పైగా అధికారులను వివిధ సమస్యల పేరిట టచ్ లో ఉంటు బాహాటంగానే పైసలు అడుగుతున్నారట.వీరందరిని సర్వీస్ మ్యాటర్స్ అన్ని తానె చుస్తూండటంతో చేసేది లేక ముడుపులు ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు.ఈయన గారు గతంలో టెక్నీకల్ ఎడ్యుకేషన్ లో పదేళ్లు చక్రం తిప్పి పనిష్మెంట్ కింద ట్రైబల్ వెల్ఫేర్ కు బదిలీ అయి వెళ్లారు. అక్కడి నుండి పంచాయితీ రాజ్ కు రావడంతో మిగతా ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదట. శాఖపరమైన అంశాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకుంటు ముందుకు వెళ్తున్న మంత్రి సీతక్క , సెక్రెటరీ లోకేష్ కుమార్ లకు ఇలాంటి అధికారుల వల్ల చెడ్డ పేరు వస్తుంది అంటున్నారు తోటి ఉద్యోగులు.
Comments
Post a Comment