తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో కొత్త అంశం.


 తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో కొత్త అంశం.
 బిఆర్ఎస్ పిరియడ్ లో ఒకలా కంగ్రెస్ పిరియడ్ లో మరోలా.

అప్పుడు బీహార్ బ్యాచ్ అంటూ ఎద్దేవా. 

 ఇప్పుడు తమిళ బ్యాచ్ అంటూ విసుర్లు. 


           

ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్న విమర్శల పర్వం ఎప్పుడు ఉండనే ఉంటుంది. గులాబీ పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారుల్లో ఎక్కువ మంది బీహార్ వాళ్ళకే పదవులు అంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ. ఇపుడు అదే ఆరోపణలను ఎదురుకొంటుంది. అదేదో సినిమాలో అప్పట్లో బుష్ ఇప్పట్లో ముషారఫ్ అన్నట్లు టీఆరెస్ ప్రభుత్వంలో బీహార్ బ్యాచ్ అన్న విమర్శలకు కౌంటర్ గా లేటెస్ట్ గా తమిళ బ్యాచ్ అన్న ప్రచారం తెర మీదకు వస్తుంది. ఒకే రాష్ట్రానికి చెందిన చాల మంది ఆఫీసర్లు అప్పట్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. సీఎస్ , కమర్షియల్ టాక్స్ , రెవెన్యూ , సిసిఎల్ఏ ఇరిగేషన్ , హెచ్ ఎం డీ ఏ లాంటి అత్యంత ప్రాధాన్యత గల పోస్టుల్లో మాజీ ముఖ్య మంత్రి కెసిఆర్ కూర్చోబెట్టారని తీవ్ర స్థాయిలో అప్పటి ప్రతి పక్ష ప్రస్తుత రూలింగ్ పార్టీ విమర్శలు చేసింది.పాత ప్రభుత్వ తరహాలోనే కాంగ్రెస్ కూడా తమిళనాడు కు చెందిన పలువురు ఆఫీసర్లకు కీలక శాఖలు అప్పగిస్తున్నరట. మున్సిపాల్ , సీఎంఓ , పంచాయితీ రాజ్ , ఫారెస్ట్ , గ్రేటర్ హైదరాబాద్ మునిసిపాల్ కార్పొరేషన్ లాంటి ఆదాయం సమకూరే డిపార్ట్మెంట్లలో ప్రస్తుతం ఉన్నవాళ్ళంతా ఒకే స్టేట్ కి చెందిన వారట.అయితే సచివాలయం లో మున్సిపాల్ శాఖలో ఉన్న అధికారి ఫైళ్లను చూడటం లేదని కింది స్థాయి అధికారులు చెవులు కోరుక్కుంటున్నారని వినికిడి.జీహెచ్ఎంసీలో ఉన్నపుడు కూడా ఇదే తంతు ఉండటంతో స్టాఫ్ లోబో దిబో అన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.ఒకవైపు ముఖ్య మంత్రి గా రేవంత్ రెడ్డి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటుంటే ఇంకోవైపు ఆఫీసర్లు సరిగా సహకరించడం లేదు.ఇప్పటికైనా ప్రజలకు ఆమోదయోగ్యమైన ఆఫీసర్లతో పనిచేయించుకుంటే మెరుగైన ఫలితాలు సాదించొచ్చు అంటున్నారు విశ్లేశకులు.

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ

ఆ బ్రాండెడ్ దుస్తులే కావాలట.