ప్రభుత్వంలో అధికారుల పనితీరుపై విమర్శలు

                                        ప్రభుత్వంలో అధికారుల పనితీరుపై విమర్శలు 

                      పలువురు సీనియర్ ఐఏఎస్ ల వ్యవహార శైలిపై ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ 

                 ప్రాధాన్యత గలిగిన పోస్టుల్లో ఉన్న పని చేయడం లేదంటూ విమర్శలు 

       మొన్నటి వరకు జీహెచ్ ఎంసీ , సీఎంఓలో కీలకంగా ఉన్న ఆఫీసర్ల తీరుపై విమర్శలు 

తెలంగాణ ప్రభుత్వంలో పని చేస్తున్న కొంతమంది అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి.బిఆర్ఎస్ పిరియడ్ లో లూప్ లైన్ లో ఉన్న ఆఫీసర్లకు కాంగ్రెస్ పవర్ లోకి రాగానే పెద్ద పీట వేస్తున్నారు.ఇందులో కొంతమంది అధికారులు రేవంత్ రెడ్డి స్పీడ్ కు అనుగుణంగా పని చేయకపోడంతో పాలనా పరమైన ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేసిన అదికారి పదుల సంఖ్యలో ఫైళ్లను పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం.తరువాత సెక్రెటరియేట్ కి బదిలీపై వెళ్లిన  సంబంధింత శాఖను పట్టించుకోవడం లేదట. జిహేచ్ఎంసీ కమిషనర్ గా కేవలం ఏడు నెలలు మాత్రమే పని చేసారు. ఖమ్మం కలెక్టర్ గా తొమ్మిది నెలలు ,మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా  కొద్దీ రోజలే పనిచేసారు. ఇక ఎడ్యుకేషన్ శాఖలో కీలక హోదాలో బాధ్యతలు నిర్వహించిన మరో సీనియర్ అధికారి తీరు కూడా అలాగే ఉంది.దింతో ఉపాధ్యాయులు , అనుబంధ సంఘాల లీడర్లు సీఎం కు పిర్యాదు చేసారు.ఇప్పుడు అయన స్థానంలో శ్రీనివాస రాజు రావడంతో డిపార్ట్మెంట్ లో అంత ఊపిరి పీల్చుకున్నారు. ఇలా నెలల తరబడి ఫైళ్లను పెండింగ్ లో పెట్టె ఆఫీసర్ల వల్ల సర్కార్ కు చెడ్డ పేరు వస్తుందన్న విమర్శలు ఎక్కువ అవుతున్నాయి.

Comments

Popular posts from this blog

రోజు రోజు వివాదమౌతున్న ఆ శాఖ

సీఎస్ వైఖరి పై చర్చ

ఆ బ్రాండెడ్ దుస్తులే కావాలట.