ఆ అధికారి తీరుపై సెక్రెటరియేట్ లో చర్చ.
ఆ అధికారి తీరుపై సెక్రెటరియేట్ లో చర్చ.
ఇరిగేషన్ మహిళా ఎస్ఓ అధికారిణికి తప్పని చెకింగ్ తిప్పలు.
ఏ శాఖలో పనిచేస్తున్నారంటు వాకబు.
తానూ ఇరిగేషన్ శాఖ లో ఎస్ ఓ నని చెప్పిన సెక్క్యూరిటీ రీసన్స్ తో చెకింగ్ చేసిన సిబ్బంది.
నిత్యం సచివాలాయానికి వచ్చే విజిటర్స్ ను చెకింగ్ పేరుతో ఆపుతున్న వైనం.
ముఖ్య మంత్రి సొంత జిల్లా వారికీ తప్పని తిప్పలు.
ఏస్పిఎఫ్ ఉన్నతాధికారుల వైఖరిపై తీవ్ర స్థాయిలో ప్రచారం.
తెలంగాణ సచివాలయ వర్గాల్లో ఈ మధ్య కాలంలో ఓ అంశం తీవ్ర చర్చనియాంశంగా మారింది. ప్రధానంగా సెక్రెటరియేట్ లో విధులు నిర్వహించే ఓ ఉన్నత స్థాయి తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. సచివాలయం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి గుండె కాయలాంటిది.ఇక్కడకు యావత్తు తెలంగాణ నుండి నిత్యం దాదాపు యాబై వేల మంది వరకు ఆయా పనుల నిమిత్తం వస్తుంటారని అంచనా. ఇందులోపనుల నిమిత్తం వచ్చే వారు ఉంటారు.వివిధ డైరెక్టరేట్లు , కమిషనర్ కార్యాలయాలు , హెచ్ఓడిల ఆఫీస్ ల నుండి సైతం రివ్యూలు , సమీక్షలకు అటెండ్ అయ్యేందుకు వస్తుంటారు. వీరితో పాటు ఉద్యోగుల సమస్యలు, సామాన్య ప్రజలు అర్జీలు పెట్టుకునేందుకు వస్తుంటారు.అయితే రెగ్యులర్ ఉద్యోగులు డైరెక్ట్ వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. విజిటర్స్ కి మాత్రం కేటాయించిన సమయంలోనే అనుమతి తో కూడిన ఎంట్రీ పాస్ తో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చింది. అనుమానితులను లోపలికి వెళ్లకుండా ఆపే అధికారం లేదా లోపల అనుమానితులుగా ఉండే వారిని విచారించే అధికారం ఉంటుంది. సెక్రెటరియేట్ లో పని చేసే రెగ్యులర్ ఉద్యోగులకు ఈ ఇబ్బందులు తప్పడం లేదు. లోపలికి వెళ్ళేటప్పుడు సంబంధిత గుర్తింపు కార్డులు చూపించిన తరువాతనే అనుమతి ఇస్తారు. అయితే లేటెస్ట్ గా ఇరిగేషన్ లో పనిచేస్తున్న ఓ సెక్షన్ ఆఫీసర్ (మహిళ) ను లోపల ఉండే సెక్యూరిటీ కానిస్టేబుల్స్ అనుమానితంగా విచారించరట. తానూ ఇక్కడే పనిచేసే మహిళా అధికారిణి అని చెప్పిన వినకుండా వివరాలు చెప్పాలని అడగటం తో అవాక్కయ్యారట.మమల్ని అడిగాలని ఎవరు ఆదేశించారని సదరు మహిళా అధికారి అడగటంతో తమ సిఎస్ఓ ఆదేశాలు అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.పంచాయితీ రాజ్ శాఖలో రివ్యూ సందర్బంగా కొంతమంది ఈఈలు , డీఈలు సచివాలయానికి వచ్చారట. సంబంధిత శాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి వచ్చిన ఇంజనిర్లను అనుమతి లేదని ఆపడంతో సెక్క్యూరిటీ వాళ్ళమీద సీరియస్ అయినట్లు సమాచారం.దింతో అక్కడ విధులు నిర్వహించే పోలీసులు తమ పై అధికారి చెప్పినట్లు చేయడమే తమ కర్తవ్యం అంటూ బదులు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. వివిధ పనుల నిమిత్తం మంత్రుల సొంత నియోజకవర్గాల నుండి వచ్చే సందర్శకులకు కూడా అనుమతి లేదంటూ వెనక్కి పంపడంతో ఇదేం ప్రజా పాలనా అంటు నేరుగా తమ అమాత్యుని దగ్గరకు వెళ్లి సీఎస్ఓ తీరుపై పిర్యాదు చేస్తున్నారట.
ReplyForward |
Comments
Post a Comment